గద్వాల జిల్లాలో రైతులకు బేడీలు ఘటనపై..ఎస్హెచ్ఆర్సీకి ఫిర్యాదు

 గద్వాల జిల్లాలో రైతులకు బేడీలు ఘటనపై..ఎస్హెచ్ఆర్సీకి ఫిర్యాదు

పద్మారావునగర్, వెలుగు: గద్వాల జిల్లాలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై న్యాయవాది రామారావు ఇమ్మానేని.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌‌‌(ఎస్​హెచ్ఆర్​సీ)లో ఫిర్యాదు చేశారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి, తీవ్రంగా కొట్టినట్లు ఆయన ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకోవడం రైతుల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.

న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడం మానవ హక్కుల ఉల్లంఘన అని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ చంద్రకాంత్, ఏఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐలు సురేశ్, ఆంజనేయులు, వారిని ఆదేశించిన ఎస్పీ టి. శ్రీనివాస రావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత రైతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని, ఘటనపై దర్యాప్తు జరపించాలని పిటిషన్‌‌‌‌లో కోరారు. పిటిషన్‌‌‌‌ను స్వీకరించిన ఎస్​హెచ్ఆర్​సీ దర్యాప్తు చేపట్టింది.